YVB Rajendraprasad: రేపు పంచాయితీరాజ్ సదస్సు.. ముఖ్య అతిథిగా చంద్రబాబు హాజరు

Written by hari

Published on:

Andhrapradesh: రాష్ట్ర స్థాయి పంచాయితీరాజ్ సదస్సు రేపు(బుధవారం) మధ్యాహ్నం 2 గంటలకు మంగళగిరిలోని సీకే కన్వెన్షన్‌లో జరుగనున్నట్లు రాష్ట్ర పంచాయితీ రాజ్ ఛాంబర్ అధ్యక్షులు వైవీబీ రాజేంద్రప్రసాద్ ప్రకటించారు.

అమరావతి, జనవరి 2: రాష్ట్ర స్థాయి పంచాయితీరాజ్ సదస్సు రేపు(బుధవారం) మధ్యాహ్నం 2 గంటలకు మంగళగిరిలోని సీకే కన్వెన్షన్‌లో జరుగనున్నట్లు రాష్ట్ర పంచాయితీ రాజ్ ఛాంబర్ అధ్యక్షులు వైవీబీ రాజేంద్రప్రసాద్ (Panchayat Raj Chamber President YVB Rajendra Prasad) ప్రకటించారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. ఈ సదస్సుకు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా హాజరుకానున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ సర్పంచుల సంఘం, ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్‌ల ఆధ్వర్యంలో పంచాయతీరాజ్ సదస్సు జరగనుందని చెప్పారు

Leave a Comment