వాహన విక్రయాల్లో రికార్డు

Written by hari

Published on:

ప్రయాణికుల వాహనాల (పీవీ) టోకు విక్రయాలు 2023లో 8.3 శాతం వృద్ధితో సరికొత్త రికార్డు స్థాయి 41.08 లక్షలకు చేరుకున్నాయి. అందులో దాదాపు సగం వాటా ఎస్‌యూవీలదే…

న్యూఢిల్లీ: ప్రయాణికుల వాహనాల (పీవీ) టోకు విక్రయాలు 2023లో 8.3 శాతం వృద్ధితో సరికొత్త రికార్డు స్థాయి 41.08 లక్షలకు చేరుకున్నాయి. అందులో దాదాపు సగం వాటా ఎస్‌యూవీలదే. 2022లో రూ.10.58 లక్షలుగా ఉన్న వాహన సగటు ధర గత సంవత్సరంలో రూ.11.5 లక్షలకు పెరిగిన ప్పటికీ, రికార్డు స్థాయిలో అమ్మకాలు జరగడం మరో విశేషం. మార్కెట్‌ అగ్రగామి మారుతి సుజు కీతోపాటు హ్యుండయ్‌, టాటా మోటార్స్‌, టయోటా కిర్లోస్కర్‌ మోటార్‌ 2023లో తమ అత్యుత్తమ వార్షిక విక్రయాలను నమోదు చేసుకున్నాయి. దేశంలోపీవీ వార్షిక విక్రయాలు 40 లక్షల యూనిట్ల మైలురాయి ని దాటడం ఇదే తొలిసారి అని మారుతి సుజుకీ ఇండియా సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ శశాంక్‌ శ్రీవాస్తవ అన్నారు. 2022లో పీవీ టోకు అమ్మకాలు 37.92 లక్షల యూనిట్లుగా నమోదయ్యాయి. కాగా, 2022కి గాను మొత్తం పీవీ సేల్స్‌లో 42 శాతంగా నమోదైన ఎస్‌యూవీల వాటా 2023లో 48.7 శాతా నికి పెరిగిందని శ్రీవాస్తవ తెలిపారు. మున్ముందు ఎస్‌యూవీల వాటా 50-55 శాతానికి పెరగవచ్చన్నారు.

మారుతిదే సగం వాటా..

గత సంవత్సరంలో మారుతి సుజుకీ విక్రయాలు 20 లక్షల యూనిట్ల మైలురాయిని దాటాయి. అంటే పరిశ్రమ మొత్తం విక్రయాల్లో సగం మారుతివే. అంతేకాదు, గత ఏడాది కంపెనీ ఆల్‌టైం రికార్డు స్థాయిలో 2,69,046 యూనిట్ల కార్లను ఎగుమతి చేసింది. గ్రామీణ మార్కెట్లలో 7.76 లక్షల యూనిట్ల విక్రయాలు, ప్రీ-ఓన్డ్‌ కార్ల సేల్స్‌ 4.6 లక్షల యూనిట్లు కూడా కంపెనీ చరిత్రలోనే అత్యధికమని శ్రీవాస్తవ వెల్లడించారు. ఇతర కంపెనీల విక్రయా లిలా ఉన్నాయి.

  • హ్యుండయ్‌ మోటార్‌ ఇండియా గత ఏడాది 9 శాతం వృద్ధితో 7,65,786 వాహనాలను విక్రయించింది. అంతేకాదు, కంపెనీ దేశీయ విక్రయాలు కూడా తొలిసారిగా 6 లక్షల యూనిట్ల మార్క్‌ను దాటాయి.
  • టాటా మోటార్స్‌ కూడా ఆల్‌టైం రికార్డు స్థాయిలో 5.53 లక్షల యూనిట్ల వాహనాలను విక్రయించింది. 2022తో పోలిస్తే 2023లో టయోటా కార్ల అమ్మకాలు ఏకంగా 46 శాతం వృద్ధితో 2,33,346 యూనిట్లకు చేరుకున్నాయి.

ఆటో పీఎల్‌ఐ పొడిగింపు

ఆటోమొబైల్‌, ఆటో విడిభాగాల పరిశ్రమకు అందిస్తున్న ఉత్పత్తి అనుసంధానిత ప్రోత్సాహకాల పథకం (పీఎల్‌ఐ) గడువు ‘‘పాక్షిక సవరణ’’లతో మరో ఏడాది పొడిగిస్తున్నట్టు భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ ప్రకటించింది.

Leave a Comment