యువతకు అలర్ట్.. ఓటు నమోదుకు మరో 3 రోజులే ఛాన్స్..!

Written by hari

Published on:

Vote Apply Online TS: సార్వత్రిక ఎన్నికల్లో ఓటు హక్కును పొందేందుకు దరఖాస్తు చేసుకోవడానికి మరో మూడు రోజుల సమయమే ఉంది. జనవరి 5వ తేదీలోపు ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకున్నవారికే.. సార్వత్రిక ఎన్నికల్లో ఓటు వేసే అవకాశం ఉంటుందని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. ఇందుకోసం.. ఆన్ లైన్‌తో పాటు ఆఫ్ లైన్‌లో కూడా అప్లై చేసుకునే ఛాన్స్ ఉంది. అడ్రస్ మార్పునకు కూడా అవకాశం ఉంది.

Vote Apply Last Date in Telangana: యువతకు ముఖ్య గమనిక. సార్వత్రిక ఎన్నికల్లో ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవడానికి మరో 3 రోజుల గడువు మిగిలి ఉంది. జనవరి 1 నాటికి 18 సంవత్సరాలు నిండిన వారు.. ఇప్పటి వరకు ఓటు లేనివారు తమ ఓటుహక్కు నమోదు చేసుకోవడానికి కేంద్ర ఎన్నికల సంఘం ఈ నెల 5వ తేదీ వరకు అవకాశం ఇచ్చింది. కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం ఫిబ్రవరి 8న తుది ఓటరు జాబితాను ప్రకటించనున్నారు. అయితే.. ఆ జాబితాలో రావలంటే.. జనవరి 5వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

Leave a Comment